ఖమ్మం : టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ షేక్ బుడాన్ బేగ్ కరోనాతో సోమవారం బెంగళూరులో మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన బేగ్.. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనకుంటూ ఓ ముద్రవేశారు. వరంగల్లో ఆర్ఈసీ ఇంజినీరింగ్ చేశాడు. అప్పుడు ఆర్ఎస్యూలో యాక్టివ్గా పనిచేశారు. ఈ క్రమంలో ఎన్నో కేసులు, నిర్బంధాలు ఎదుర్కొన్నాడు.
తరువాత కొంతకాలం సీపీఐలో పనిచేశారు. అనంతరంలో టీఆర్ఎస్లో చేరి అంచెలంచెలుగా జిల్లా అధ్యక్షుడి స్థాయి వరకు ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఎస్ఐడీసీ చైర్మన్గా నియమితులయ్యారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.
2018 డిసెంబర్లో శాసనసభ ఎన్నికలప్పుడు టీడీపీలోకి వెళ్లారు. అనంతరం తిరిగి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లోకి వచ్చారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతానికి బేగ్ ఎంతో కృషి చేశారు.
ఇవి కూడా చదవండి..
పైల్వాన్ పూర్లో వ్యక్తి దారుణ హత్య
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
గద్వాలలో కరోనా రోగులకు నిత్యాన్నదానం
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
కోల్కతా సీబీఐ ఆఫీస్ ముందు టీఎంసీ ఆందోళన