ముంబై: మహారాష్ట్రలో ఈ నెల 20 నుంచి యూనివర్సిటీలు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. అయితే కరోనా టీకా తీసుకున్న విద్యార్థులను మాత్రమే ప్రత్యక్ష తరగతులకు అనుమతిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే విద్యార్థులకు వ్యాక్సిన్ కోసం టీకా శిబిరాలను నిర్వహిస్తామని తెలిపింది. మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా మంత్రి ఉదయ్ సమంత్ ఈ మేరకు ప్రకటించారు. ప్రత్యక్ష తరగతులకు హాజరు కాలేని విద్యార్థుల కోసం ఈ నెల 20 నుంచి ఆన్లైన్ తరగతులను కూడా నిర్వహించాలని యూనివర్సిటీలు, కాలేజీలకు సూచించారు.
కాగా, మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గడంతో ఈ నెల 4 నుంచి స్కూళ్లు, జూనియర్ కాలేజీలను తెరిచారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు.