ఆయన లెఫ్ట్ డీఎన్ఏ,రైట్ డీఎన్ఏ కాదు.. కరోనా వైరస్
బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు
ఇల్లందకుంట. జూన్15: స్వాభిమానం అంటూ గొప్పలకు పోయి, నిరాదరణకు గురై ఉన్న పరువును, ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన మాజీ మంత్రి ఈట ల రాజేందర్, హుజూరాబాద్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, బీసీ కమిషన్ పూర్వ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడారు. కోట్ల రూపాయలు వెచ్చించి, ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన ఈటలను బీజేపీ అధినాయకత్వం సరైన రీతిలో గౌరవించకపోవడంతో ఆయనకు రాష్ట్రంలో ఊహించిన సీన్ లేదని తేటతెల్లమయ్యిందన్నారు. మొదటి నుంచి టీఆర్ఎస్ చెబుతున్నట్లుగానే, తనకు తాను ఎక్కువగా ఊహించుకొని ఈటల బొక్కబోర్ల పడ్డారని ఎద్దేవా చేశారు.
కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి ఆయన చేసిన మోసానికి తగిన శాస్తి జరిగిందన్నారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థితికి అవకాశాలు కల్పించిన టీఆర్ఎస్పై ఈటల కుట్రలను, నిజస్వరూపాన్ని బీజేపీ కూడా గమనించినట్లు ఉందన్నారు. బీజేపీ అధినాయకత్వం ఈటలకు సాదర స్వాగతం పలుకలేదన్నారు. ఈటల చెప్పుకొన్నట్లు ఆయన లెఫ్ట్ డీఎన్ఏ, రైట్ డీఎన్ఏ కాదని.. కరోనా వైరస్ అని, ఎందులో ప్రవేశించినా తానే లబ్ధిపొందుతాడని పేర్కొన్నారు. నాడు బలంగా ఉన్న పీడీఎస్యూ విద్యార్థి సంఘంలో చేరి అక్కడ గొప్ప లబ్ధిపొందినట్లు చెప్పారు. 2003లో బలంగా ఉన్న టీఆర్ఎస్లో చేరి ఉన్నతంగా ఎదిగారన్నారు. బీజేపీలో చేరి హుజూరాబాద్ పరువును ఢిల్లీలో ఎందుకు తీశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలన నుంచి విముక్తికి పోరాటం చేస్తానని ప్రగల్భాలు పలుకడం ఆత్మహత్యా సదృశ్యమన్నారు. ప్రజారంగ పాలన చేస్తున్న సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా తాహతుకు మించి మాట్లాడడం మానుకోవాలని సూచించారు. హుజూరాబాద్లో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా, ప్రజలందరూ కేసీఆర్ వైపు ఉంటూ, టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో సర్పంచులు మొగి లి, ఎంపీటీసీ విజయాకుమార్, మాజీ ఎంపీటీసీ రాంస్వరణ్రెడ్డి, ఉపసర్పంచ్ మహేందర్, టీఆర్ఎస్ యూత్ నాయకులు రాజు, అనిల్, నేతలు రాకేశ్, తరుణ్ పాల్గొన్నారు.