న్యూఢిల్లీ : కొత్త పార్లమెంటు భవనాన్ని కట్టాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు లోక్సభలోగానీ, రాజ్యసభలోగానీ ఒక్క ఎంపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. విపక్షాల ఎంపీలు ప్రాజెక్టు మీద విమర్శలు చేయడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓంబిర్లా విలేకరులతో మాట్లాడారు.కొత్త భవన నిర్మాణం 2022 అక్టోబరుకల్లా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.