రంగారెడ్డి, జూలై 2, (నమస్తే తెలంగాణ): హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఆరు మొక్కలు చొప్పున ప్రభుత్వం అందజేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ, సాయినగర్, కమల, నెహ్రునగర్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడో విడుత హరితహారంలో భాగంగా అందరూ విరివిగా మొక్కల నాటాలని, ప్రతి ఇంట్లో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ కార్పొరేషన్గా మీర్పేట్ను తీర్చిదిద్దేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. చెత్తను బయట ప్రాంతాల్లో వేయకుండా వీధులన్నీ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇంటింటికీ సేకరిస్తున్న ఆటోలో వేయాలని సూచించారు. హరితహారం కార్యక్రమం కోసం మీర్పేట్ కార్పొరేషన్కు ఇప్పటివరకు రూ.3 కోట్ల నిధులను ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. కార్పొరేటర్లు తమ డివిజన్ పరిధిలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు.
విరివిగా మొక్కలు నాటాలి
షాబాద్, జూలై 2: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, సర్పంచ్ పోనమోని కేతనతో కలిసి పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ గ్రామాలన్నీ పరిశుభ్రంగా మారుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ దిశగా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ జడల లక్ష్మీరాజేందర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పొన్న స్వప్ననర్సింహారెడ్డి, మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, పీఏసీఏస్ చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, ఎంపీడీవో అనురాధ, ఎంపీవో హన్మంత్రెడ్డి, ఫారెస్ట్ అధికారి పిర్యానాయక్, పంచాయతీ కార్యదర్శి మల్లేశ్, టీఆర్ఎస్ నాయకులు కుమార్యాదవ్, మల్లయ్య, రమేశ్, పాపిరెడ్డి, నర్సింహారెడ్డి, అంజయ్య, యాదయ్య, రవి, శ్రీనివాస్, దినేశ్ పాల్గొన్నారు.