భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాల నిర్వహణ కమిటీ చైర్మ న్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణాచారి పేర్కొన్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశ స్వాతంత్య్ర పోరాటంపై తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఉంచిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేవీ రమణాచారి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహనీయుల త్యాగం వల్లనే స్వాతంత్య్రం సిద్ధించిందని, ఇందుకు సంబంధించిన ఛాయా చిత్రాలను ఏడు రోజుల పాటు ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపా రు. అవకాశాన్ని విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ఓబీ) డైరెక్టర్ శృతిపాటిల్, రీజినల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.