న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.147 తగ్గి రూ.44,081కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 44,228 వద్ద ముగిసింది. రూపాయి కాస్త బలపడటమే బంగారం ధర స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
బంగారం ధర స్వల్పంగా తగ్గినా వెండి ధర మాత్రం ఇవాళ భారీగా పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,036 పెరిగి రూ.64,276కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.63,240 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో సైతం ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,726 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.14 అమెరికన్ డాలర్లు పలికింది.