న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను సోమవారం కలిశారు. డీఎంకే ఎంపీ టీఆర్ బాలుతో కలిసి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. తమిళనాడు అసెంబ్లీ శతాబ్ది వేడుకలతోపాటు మాజీ సీఎం కరుణానిధి చిత్రపటాన్ని అసెంబ్లీలో ఆవిష్కరించడానికి రాష్ట్రపతి కోవింద్ను ఆహ్వానించారు. తమ ఆహ్వానానికి రాష్ట్రపతి అంగీకారం తెలిపారని సీఎం స్టాలిన్ మీడియాతో అన్నారు. తమిళనాడు సందర్శన తేదీల వివరాలను తర్వలో వెల్లడిస్తామని చెప్పారు.