తిరువనంతపురం : కొవిడ్-19 వ్యాప్తితో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిన క్రమంలో రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పించేలా ముఖ్యమంత్రి పినరయి విజయన్ పలు చర్యలు ప్రకటించారు. మహమ్మారితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమయంలో రుణాల రికవరీ పేరుతో బ్యాంకులు వేధించరాదని అన్నారు.
రెండు నెలల పాటు పెండింగ్ బిల్లుల వసూలును నిలిపివేయాలని కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు, కేరళ వాటర్ అథారిటీలను కోరిందని సీఎం వెల్లడించారు. కేరళలో పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టనందున మరిన్ని నియంత్రణ చర్యలు అవసరమని అన్నారు. ఇక కేరళలో బుధవారం అత్యధికంగా 41,953 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 58 మంది మరణించారు.