అమరావతి : ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో జిల్లా కోర్టు నుంచి వైద్య బృందం నివేదిక హైకోర్టుకు వెళ్లింది. జస్టిస్ ప్రవీణ్ కుమార్ నివాసానికి జిల్లా కోర్టు ప్రత్యేక మెసెంజర్ యాప్ ద్వారా నివేదికను పంపింది. కాసేపట్లో హైకోర్టు దీనిపై విచారించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఎంపీ రఘురామకృష్ణరాజుకు కాళ్లకు గాయాలు ఎలా తగిలాయన్న దానిపై గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. జైలు అధికారులు ఆయనకు 3468 నెంబర్ను కేటాయించినట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.