ఉప్పల్ : నియోజకవర్గంలో ప్రజా అవసరాలు గుర్తించి పను లు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శనివారం నాచారంలోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్తో కలిసి పర్యటించారు. కార్తికేయనగర్లో పీవీసీ వాటర్ లైన్ లేయింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కాలనీవాసుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీల్లో మౌలికవసతుల కల్పనకు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం జాన్షరీఫ్, ఏజీఎం శిల్ప, నేతలు సాయిజెన్ శేఖర్, పోగుల రమణారెడ్డి, మేకల ముత్యంరెడ్డి, ఎర్రం శ్రీనివాస్రెడ్డి, భూపాల్రెడ్డి, కాలనీవెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు దత్తారెడ్డి, రామకృష్ణాగౌడ్, చంద్రశేఖర్, ఆనంద్, మొయినుద్దీన్, కట్ట బుచ్చన్న, గరిక సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా తడి, పొడి చెత్త సేకరణ వాహనాలను ఎమ్మె ల్యే, కార్పొరేటర్ ప్రారంభించారు. నాచా రం బాబానగర్కు చెందిన ఏ.నర్సింగ్కు రూ.2 లక్షల సీఎం రిలీఫ్ఫండ్ ఎల్వోసీ పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు.