హైదరాబాద్: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో పండుగ శోభ సంతరించుకున్నది. హనుమాన్ జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. కరోనా ప్రభావంతో నిరాడంబరంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో అంతర్గతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం అంకురార్పణతో ప్రారంభమైన వేడుకలు మూడురోజుల పాటు జరిగాయి. బుధవారం వేకువజామునుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. గతేడాది కూడా లాక్డౌన్ కారణంగా భక్తులు లేకుండానే నిరాడంబరంగా ఉత్సవాలు జరిగాయి.
కాగా, తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. హనుమంతుని జన్మస్ధలం అంజనాద్రి అని టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.