న్యూఢిల్లీ : ససెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభమవుతన్న నేపథ్యంలో ఆయా స్కూళ్లలో ప్రస్తుతం చేపడుతున్న వ్యాక్సినేషన్, రేషన్ పంపిణీ కార్యక్రమాలు ఇక ముందూ కొనసాగుతాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తొలి దశలో 9 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు మాత్రమే తరగతులు ఉన్నందున స్కూళ్లలో వ్యాక్సినేషన్, రేషన్ పంపిణీకి ఎలాంటి సమస్యలూ ఎదురుకాబోవని ఆయన పేర్కొన్నారు. తరగతులకు దూరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పారు.
కొవిడ్-19 పరిస్థితి మెరుగైనందునే స్కూల్స్, విద్యాసంస్ధలను రీఓపెన్ చేస్తున్నామని తెలిపారు. గతంలో తల్లితండ్రులూ ప్రత్యక్ష తరగతులకు విముఖత చూపగా ఇప్పుడు వారు తమ పిల్లలకు క్లాస్రూంలోనే తరగతులు నిర్వహించాలని కోరుతున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేసుల పెరుగుదల, థర్డ్వేవ్ సంకేతాలను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఓ ప్రశ్నకు బదులిస్తూ ఆయన చెప్పారు. తరగతులకు హాజరు కావాలని విద్యార్ధులను ఒత్తిడి చేయబోమని, ఆన్లైన్ తరగతులూ అందుబాటులో ఉంటాయని తెలిపారు.