ఆదిలాబాద్ : పౌరసంఘం కోసం రెండు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ జోగు ప్రేమేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ. 5 కోట్లు అదేవిధంగా రెండు శ్మశానవాటికల నిర్మాణానికి రూ. 2 కోట్ల నిధులను మంజూరు చేయడంపై ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్మాణాలతో పట్టణ రూపురేఖలు మరింత మారనున్నట్లు ప్రేమేందర్ పేర్కొన్నారు.