రాయ్పూర్, మే 23: లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల మీదకు వచ్చాడని ఓ యువకుడిని కొట్టడమే గాక అతడి ఫోన్ను పగలగొట్టిన ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లా కలెక్టర్ రణ్బీర్ శర్మపై ప్రభుత్వంపై చర్యలు తీసుకున్నది. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్.. కలెక్టర్ చేసిన పనికి ప్రభుత్వం తరఫున ఆ యువకుడికి క్షమాపణలు చెప్పడమే గాక రణ్బీర్ శర్మను బాధ్యతల నుంచి తప్పించారు. కాగా, ఈ ఘటనపై రణ్బీర్ శర్మ వివరణ ఇస్తూ.. తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా కలెక్టర్ చర్యను ఐఏఎస్ అసోసియేషన్ ఖండించింది. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి క్లిష్ట సమయాల్లో సివిల్ సర్వెంట్లు వాళ్ల బాధ్యతను మరింత గుర్తెరిగి వ్యవహరించాలని సూచించింది.