వికారాబాద్ : జిల్లాలో పర్యటనలో భాగంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు అభివృద్ధి పనులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పరిగి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తూ కుల్కచెర్ల మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కుల్కచెర్ల మండల కేంద్రంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న సహకార పరపతి సంఘం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తిర్మలాపూర్ గ్రామంలో కోటి 55 లక్షలతో నిర్మించనున్న గోదాం నిర్మాణ పనులకు రూ.80 లక్షలతో నిర్మిస్తున్న రైస్ మిల్ పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
ఆహారం వికటించి 41 మందికి అస్వస్థత
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన : మంత్రి సబిత