చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అన్నాడీఎంకే, ఏఎంఎంకే మధ్య ఘర్షణ జరిగింది. అరుప్పుక్కోట్టై అసెంబ్లీ నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి వైగై సెల్వన్, సత్తూర్ కౌంటింగ్ హాల్ వద్దకు వచ్చారు. దీంతో అన్నాడీఎంకే, ఏఎంఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగిరింది. ఈ ఘర్షణలో ఏఎంఎంకేకు చెందిన తిరుమలై రాజన్ చొక్కా చిరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. మరోవైపు తమిళనాడులో డీఎంకే కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నది.