మండల సమావేశంలో వాంకిడి ఎంపీపీ విమలాబాయి
ఆసిఫాబాద్(వాంకిడి),మార్చి16 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అభివృద్ధికి పాటుపడాలని ఎంపీపీ విమలాబాయి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. అనంతరం జడ్పీటీసీ అజయ్కుమార్ మాట్లాడుతూ మండలంలో అభివృద్ధి పనుల కోసం నిధుల మంజూరుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం అధికారులు శాఖల వారీగా ప్రగతి నివేదికలను చదివారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ పెంట య్య, తహసీల్దార్ మధూకర్, ఎంపీడీవో వెంకటేశ్వర్రెడ్డి, ఏవో వినోద్కుమా ర్, ఎంపీవో శివకుమార్, ఎంఈవో మణికుమార్, ఏఈలు శైలేందర్, స్టిఫెన్, వైద్యాధికారి సతీశ్ కుమార్, శివప్రసాద్, సీడీపీవో రేభక్కా, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.