న్యూఢిల్లీ, మే 28: భారతదేశ పౌరసత్వం కోసం ముస్లిమేతర శరణార్థులు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రహోంశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి భారత్కు వచ్చి గుజరాత్ (మోర్బీ, రాజ్కోట్, పటాన్, వడోదరా జిల్లాలు), రాజస్థాన్ (జలోర్, ఉదయ్పూర్, పాలి, బర్మేర్, సిరోహి), ఛత్తీస్గఢ్ (దర్గ్, బలోదాబజార్), హర్యానా (ఫరీదాబాద్), పంజాబ్లోని జలందర్ జిల్లాతో కలిపి మొత్తం 13 జిల్లాల్లో నివాసం ఉంటున్న శరణార్థులు దీనికి అర్హులని వెల్లడించింది. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవ మైనార్టీ వర్గానికి చెందిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.