హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావును ఏపీ రాష్ట్ర మాజీ మంత్రి గంటా శ్రీనివాస్రావు కలిశారు. శనివారం అసెంబ్లీలాబీలో కేటీఆర్ను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రులతో కలిసి బృందంగా వైజాగ్ వస్తామని కేటీఆర్ చెప్పారని గంటా పేర్కొన్నారు. ఈ భేటీలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చర్చించినట్టు తెలిసింది.