రామాయంపేట, మే 3: రెండు రోజుల పాటు టీకాలు లేకపోవడంతో రామాయంపేట, డీ. ధర్మారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి , రామా యంపేట ప్రభుత్వ దవాఖానకు సోమవారం ప్రజలు రావడంతో పోలీసులు వచ్చి క్యూలైన్లో ఉంచారు. అనంతరం వైద్యురాలు ఎలిజబెత్ రా ణి వ్యాక్సిన్ వేశారు. అనంతరం వైద్యురాలు విలేకరులతో మాట్లాడారు. రామాయంపేట, డీ. ధర్మా రం పీహెచ్సీలో మొత్తం మొదటీ డోస్ 8252 మందికి వేశామని, రెండో డోస్ 1454 మందికి ఇచ్చామన్నారు. రెండో డోస్కు సమయం గడిచినా వ్యాక్సి న్ లేక ప్రజలు రావడం లేదన్నారు. మొ దటీ టీకాను వేసుకు న్న వారు కచ్చితంగా రెండో డోస్ వేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు రెండు ప్రాథమిక కేంద్రాల్లో594 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రభు త్వం ఉచితంగా అందజేస్తున్న వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు.
సీఎం కార్యదర్శికి విన్నవించిన మున్సిపల్చైర్మన్ జితేందర్గౌడ్
రామాయంపేట ప్రభుత్వ దవాఖానలో ర్యాపిడ్ టెస్టు కిట్స్లేక తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, రోజు కు వంద కరోనా ర్యాపిడ్ కిట్లను తమ కు అందజేయాలని సీఎం వ్యక్తిగత కార్యదర్శితో ఫోన్లో విన్నవించినట్లు రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్ అన్నా రు. సోమవారం మున్సిపల్ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. కరోనా పరీక్ష కిట్లు లేక వచ్చిన వారు తిరిగి వెళ్లిపోతున్నారని ఈ విషయమై ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ హరీశ్తో కూడా మాట్లాడినట్లు చైర్మన్ తెలిపారు. వాటితో పాటు వ్యాక్సిన్ రోజుకు 200 మందికి ఇస్తున్నామని అవి లేక రోజుకు 50మందికి మాత్రమే ఇస్తున్నామని సీఎం కార్యదర్శి రాజశేఖర్రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సమావేశంలో కౌన్సిలర్ యాదగిరి, టీఆర్ఎస్నాయకుడు కొండల్రెడ్డి తదితరులు ఉన్నారు.