న్యూఢిల్లీ: అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ విలియం బర్న్స్తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం ఢిల్లీలో భేటి అయ్యారు. ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులపై వీళ్లిద్దరూ చర్చించారు. అక్కడ తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజే ఈ ఇద్దరూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా ఉగ్రవాదిగా గుర్తించిన వ్యక్తినే తాలిబన్లు ప్రధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ధోవల్, బర్న్స్ ఏం చర్చించారన్న విషయంపై స్పష్టత లేదు. దోవల్ ఇప్పటికే రష్యా ఎన్ఎస్ఏతోనూ భేటీ అయ్యారు.