జిల్లాలో ఘనంగా వేడుకలు
రంగుల్లో మునిగితేలిన ప్రజలు
భూపాలపల్లి టౌన్/ కృష్ణకాలనీ/ గణపురం/ పలిమెల/ టేకుమట్ల/ వాజేడు, మార్చి 29 : హోలీ వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజలు ఆనందోత్సాహాల మ ధ్య జరుపుకొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని వ ర్గాల ప్రజలు ఒకరికొకరు రంగులు చల్లుకుని సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భూపాలపల్లి పట్టణంలో టీఆర్ఎస్ అర్బ న్ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, సీనియర్ నాయకు డు బుర్ర రమేశ్, యూత్ అర్బన్ అధ్యక్షుడు బుర్ర రాజు ఆధ్వర్యంలో హోలీ వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమం లో నేతలు తాటి అశోక్, లట్ట రాజబాబు, నాగుల రాజిరెడ్డి, పైడిపల్లి రమేశ్, తాటి వెంకన్న, కౌన్సిలర్లు వేడుకల్లో పాల్గొ న్నారు. సింగరేణికి కూడా సెలవు కావడంతో పెద్ద ఎత్తున కార్మికులు రోడ్లపైకి వచ్చి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. రెడ్డి కాలనీ, కృష్ణకాలనీ, కారల్ మార్క్స్ కాలనీ, జవహర్ నగర్ కాలనీ, శాంతి నగర్ కాలనీల్లో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ప్రజ లు హోలీ ఆడారు. జర్నలిస్టులు కాకతీయ ప్రెస్క్లబ్ ఆవరణ లో రంగులు పూసుకుని హోలీ వేడుకలు జరుపుకున్నారు. వాజేడు మండలకేంద్రంతోపాటు పేరూరు పోలీసుస్టేషన్లో సోమవారం సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు హోలీ సంబురా లు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బండి హరికృష్ణ , సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.