న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో నిందితుడు, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీని రక్షించుకునేందుకు ఆయన సోదరుడు చేతన్ చోక్సీ రంగంలోకి దిగాడు. మెహుల్ చోక్సీని నేరుగా భారత్కు అప్పగించాలన్న పిటిషన్పై డొమినికా కోర్టులో విచారణ జరుగుతున్న రోజే ఆ దేశంలో అడుగు పెట్టాడని ఆ దేశ మీడియాలో వార్తలొచ్చాయి.
డొమినికాలో అడుగు పెట్టగానే ఆ దేశ ప్రతిపక్ష నేత లెనాక్స్ లింటన్తో చేతన్ చోక్సీ సమావేశమైనట్లు తెలిసింది. నేరుగా భారత్కు మెహుల్ను అప్పగించకుండా తమకు మద్దతు ఇవ్వాలని ఆయనను చేతన్ కోరినట్లు సమాచారం. డొమినికా విపక్ష నేతకు చేతన్ భారీగా ముడుపులు చెల్లించారని వార్తలు వచ్చాయి.
అంతర్జాతీయ సరిహద్దుల పొడవునా నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తుల కిడ్నాప్కు డొమినికా ప్రభుత్వం సహకరించడం ఆమోదయోగ్యం కాదని లెనాక్స్ లింటన్ ఆరోపించారు. హాంకాంగ్ మీదుగా డొమినికాకు చేరుకున్న చేతన్ చోక్సీ.. తన సోదరుడు మెహుల్ పెట్టిన జైలుకు వెళ్లారు.
హాంకాంగ్ నుంచి వస్తూనే భారీగా రెండు లక్షల డాలర్ల సొమ్ము వెంట తెచ్చుకున్నాడని మీడియా కథనాలు వచ్చాయి. మెహుల్ చోక్సీని నేరుగా భారత్కు అప్పగించబోమని అంటిగ్వా-బార్బుడా, డొమినికా దేశాల విపక్ష నేతలు పేర్కొనడం గమనార్హం.
ఇదిలా ఉంటే మెహుల్ చోక్సీకి 2019లోనే జారీ చేసిన షోకాజ్ నోటీసును అంటిగ్వా-బార్బుడా మరోమారు జారీ చేసింది. పారిపోయిన వ్యాపారవేత్తకు పౌరసత్వం ఎందుకు రద్దు చేయొద్దో తెలుపాలని ఆ నోటీసులో కోరినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, మెహుల్ చోక్సీని నేరుగా భారత్కు అప్పగించే విషయమై దాఖలైన పిటిషన్పై డొమినికా కోర్టులో బుధవారం విచారణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో సహా పలు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే డొమినికాకు చేరుకున్నాయి.
మెహుల్ చోక్సీని నేరుగా భారత్కు ఎందుకు అప్పగించాలో తెలియజేస్తూ డొమినికా న్యాయస్థానంలో భారత్ దర్యాప్తు సంస్థలు వాదించనున్నాయి. పీఎన్బీ కుంభకోణంలో మెహుల్ చోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ రూ.13,500 కోట్లకు మోసం చేసి, 2018లో విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.
దేశ ప్రజలందరికీ ఉచితంగానే టీకాలు ఇవ్వండి.. కోవిడ్ నుంచి కోలుకుంటూ కేంద్రానికి థరూర్ విజ్ఞప్తి
ఆన్లైన్ క్లాస్ వినాలంటే ఆరు కిలోమీటర్లు నడవాల్సిందే
22 కోట్ల కోవాగ్జిన్ టీకాలను ఉత్పత్తి చేయనున్న ముంబై కంపెనీ
మరో వైరస్ కలకలం.. దేశంలో తొలిసారిగా స్కిన్ బ్లాక్ ఫంగస్ కేసు గర్తింపు
అంబులెన్సుల దందా.. 40 కి.మీటర్లకు రూ.17 వేలు
న్యూయార్క్ కన్నా ముంబైలో రెట్టింపు!
రాందేవ్ బాబా దేశ వ్యతిరేకి : ఐఎంఏ
ఎస్పీఎస్ఎన్ లో 11 జూన్ నుంచి అతిపెద్ద అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్స్ లైవ్..
నో డౌట్: ఇప్పట్లో లీటర్ పెట్రోల్ రూ.100 తగ్గదు..!!
విదేశీ వ్యాక్సిన్లకు ఆ రక్షణ కల్పించడానికి సిద్ధం!
పాక్తో కలిసి వాస్తవాధీన రేఖ వద్ద మిస్సైళ్లను పరీక్షిస్తున్న చైనా
పాకిస్థాన్లో మ్యూజియాలుగా రాజ్కపూర్, దిలీప్కుమార్ ఇళ్లు
అతిపెద్ద మాంస విక్రయ సంస్థపై సైబర్ దాడి..
ఆ ఒక్క కరోనా వేరియంటే ఆందోళన కలిగిస్తోంది: డబ్ల్యూహెచ్వో