శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లను బారాముల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోనియార్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న రెండు చైనా చేతి గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా అమ్మడం, సరఫరా, స్మగ్లింగ్ వంటి కార్యకలాపాలు చేపడుతున్నారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.