మోత్కూరు, ఏప్రిల్ 30: కొవిడ్ రెండో దశ రోజు రోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో కొవిడ్ నిబంధనలను అనుసరించి గీత కార్మికుడు బైరగాని శంకర్గౌడ్ కల్లు పోస్తున్నాడు. గ్రామంలో పలువురికి కొవిడ్ పాజిటివ్ రావడంతో శంకర్గౌడ్ కల్లు తాగడానికి వచ్చిన వారికి తాటి కమ్మలోనే భౌతిక దూరం పాటించి కల్లు పోస్తున్నారు. శంకర్గౌడ్ను చూసి గ్రామంలోని మరికొందరూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు.