ఈ ఏడాది క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ని షేక్ చేసిన రవితేజ ప్రస్తుతం ఖిలాడి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా, ఇందులో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఖిలాడి మూవీని హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఖిలాడి చిత్రంలో అనసూయ, అర్జున్తో పాటు మలయాళ హీరో ముకుందన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మే 28న ఖిలాడి గ్రాండ్ గా విడుదల కానుంది. దీనితో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12న ఉదయం 10:08 నిమిషాలకు ఖిలాడి మూవీ టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. టీజర్తో అంచనాలు భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.