మంచిర్యాల : దేశంలోనే ఎక్కడలేని విధంగా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. బుధవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖా నాయక్తో కలసి పల్లె ప్రగతి గ్రామ సభలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లె ప్రగతి ద్వారా పరిశుభ్రత, పచ్చదనంతో గ్రామాలు స్వయం సమృద్ధి వైపుగా అభివృద్ధి చెందుతాయన్నారు.
తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు చేపట్టి అమలు చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో గతంలో 8,690 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 12,769కు చేరిందన్నారు. గత ఏడేళ్లలో కొత్తగా 4,070 గ్రామపంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం నిర్మల్ మండలంలోని సకేర గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి గ్రామ సభలో మంత్రులు పాల్గొన్నారు.