భోపాల్: వైరల్ జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు నేలపై చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం వైద్య అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లోని బార్వానీలో ఈ ఘటన జరిగింది. స్థానిక జిల్లా ఆసుపత్రికి పిల్లల జ్వరం కేసులు ఇటీవల బాగా పెరిగాయి. దీంతో బెడ్లు ఖాళీ లేక నేలపై పరుపులు వేసి చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయం చీఫ్ మెడికల్ అధికారిణి అనిత సింగరే దృష్టికి వెళ్లింది. స్పందించిన ఆమె 30 పడకలు ఉన్న ఏఎన్ఎం శిక్షణ కేంద్రానికి పిల్లలను తరలించాలని ఆదేశించారు. మరో రెండు రోజుల్లో ఇది పూర్తవుతుందని చెప్పారు.