న్యూఢిల్లీ: బాలల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్న ఉద్యమకారిణి రేణుకా గుప్తా (56) ఇక లేరు. గత 20 ఏండ్లుగా బాలల సంక్షేమం గురించి కృషి చేస్తున్న ఆమె కరోనా సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా నోయిడాలోని ఓ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న ఆమె అక్కడే తుదిశ్వాస విడిచారు. దాదాపు 1300 మంది బాలికలకు అమ్మ లాంటి రేణుకా గుప్తా మృతి వార్త తెలిసి ఎంతోమంది విచారం వ్యక్తం చేస్తున్నారు.
రేణుకా గుప్తా భర్త ఇందు ప్రకాష్ సింగ్తో కలిసి ఎన్నో స్వచ్ఛంద సంస్థల కోసం, సంక్షేమ సంఘాల కోసం పని చేశారు. ఢిల్లీలోనే పుట్టి పెరిగిన రేణుక గత 40 ఏళ్లుగా లింగ వివక్ష, బాలల హక్కులు, అందరికీ విద్య లాంటి అంశాలపై పోరాటానికే తన జీవితాన్ని అంకితం చేశారు. అంతేగాక ఆమె లింగ వివక్ష గురించి స్వంతంగానూ, భర్తతోనూ కలిసి కొన్ని పుస్తకాలు రాశారు.