అప్పుడే పుట్టిన పసికందును (కర్ణుడిని) కుంతీదేవి ఒక చెక్కపెట్టెలో పెట్టి నదిలో వదిలేసిందని మహాభారతంలో చదువుకున్నాం. అచ్చం ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో చోటుచేసుకుంది. ఓ పసిపాపను చెక్కపెట్టెలో పెట్టి ఎవరో గంగానదిలో వదిలేశారు. దాద్రి ఘాట్ సమీపంలో పడవ నడిపే గుల్లు చౌదరి ఆ పెట్టెను చూసి తెరిచి చూడగా.. పసికందు ఏడుస్తూ ఉంది. ఆ పెట్టెలో దేవుడి చిత్రపటాలతో పాటు ఆ పాప జాతకపత్రం కూడా ఉంచారు. పాపను గంగామాత ప్రసాదంగా భావించిన చౌదరి ఆ చిన్నారని పెంచుకుందామనుకున్నా.. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు పాపను సంరక్షణ కేంద్రానికి తరలించారు.