ముంబై: మహారాష్ట్ర పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే)ని త్రివిధ దళాల అధిపతులు సందర్శించారు. అయితే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆర్మీ చీఫ్, జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా, ఈ ముగ్గురు సర్వీస్ చీఫ్లు ఎన్టీయే 56వ కోర్స్మేట్లు. కాగా, ఆగస్ట్ 20 నుంచి 21 వరకు ఎన్డీయే పూర్వ కోర్స్మేట్ల సమావేశం ( అల్మా-మేటర్ టుగెదర్) జరిగింది. ఈ నేపథ్యంలో ఒకే బ్యాచ్కు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ చీఫ్లు దీనికి హాజరయ్యారు.
అయితే, ఎన్డీయేలో ఒకే బ్యాచ్కు చెందిన వారు త్రివిధ దళాల అధిపతులు కావడం అరుదైన సంగతని, ఈ ముగ్గురు కలిసి అల్మా-మేటర్ టుగెదర్కు కలిసి హాజరుకావడం ఎంతో ప్రత్యేకమని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు ఎన్డీయేకు ఎంపిక కోసమే దేశంలో ఏర్పాటు చేసిన సైనిక స్కూళ్లలో బాలికలకు కూడా ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతుల ఎన్డీయే సందర్శన మరో ప్రాధాన్యత సంతరించుకున్నది.