రాయ్గఢ్: ఛత్తీస్గఢ్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాయ్గఢ్ జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దాంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రాయ్గఢ్ జిల్లాను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించింది. మే 31 వరకు జిల్లా కంటైన్మెంట్గానే కొనసాగుతుందని తెలిపింది.
అప్పటివరకు జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7:30 గంటల వరకు మిల్క్ పార్లర్లను తెరిచేందుకు మాత్రం ఛత్తీస్గఢ్ సర్కారు అనుమతించింది. అదేవిధంగా హోల్సేల్ పండ్లు, కూరగాయల మార్కెట్లను కూడా ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఆదివారాల్లో మాత్రం ఎలాంటి మినహాయింపులు లేకుండా కంప్లీట్ లాక్డౌన్ అమలవుతుందని తెలిపింది.