రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లాలోని కదేనార్ ఏరియా చిఖ్పాల్ గ్రామంలో కుక్కర్ బాంబులు కలకలం సృష్టించాయి. కదేనార్ ఏరియాలో ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు (ఐటీబీపీ) కూంబింగ్ నిర్వహిస్తుండగా చిఖ్పాల్ గ్రామం సమీపంలో మందు పాతరలను గుర్తించారు. రెండు ప్రెషర్ కుక్కర్లలో పేలు పదార్థం నింపి ఒకే దగ్గర వేర్వేరుగా వాటిని పాతిపెట్టారు. అయితే, ఐటీబీపీ జవాన్లు వాటిని అత్యంత జాగ్రత్తగా వెలికితీసి నిర్వీర్యం చేశారు.