రాయ్పూర్: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. రోజురోజుకు రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 59,118 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో దేశంలో వివిధ రాష్ట్రాలు కరోనా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి.
తాజాగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం పలు చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు మాస్కు ధరించని వారికి రూ.500 జరిమానా విధించనున్నట్లు ప్రకటన చేసింది.