రాయ్పూర్: దేశంలో ఒకవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా, మరోవైపు వ్యాక్సిన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నది. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామివేత్తలు టీకాలు తీసుకుంటూ ప్రజలంతా కూడా టీకాలు తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కొవిడ్ టీకా తొలి డోసు వేయించుకున్నారు. రాయ్పూర్లోని జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ మెడికల్లో కాలేజీలోని వైద్య సిబ్బంది ఆయనకు టీకా ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్పై అవగాన..!
ఈ లక్షణం ఉంటే పుట్టేది ఆడపిల్లే
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
వేసవిలో మామిడిపండ్లు తినొచ్చా ?