చెన్నై: పోలాండ్ నుంచి భారత్కు చేరిన ఒక విదేశీ పార్సిల్లో భారీగా ఉన్న సాలీడులను కస్టమ్స్ సిబ్బంది గుర్తించారు. పోలాండ్ నుంచి విదేశీ పోస్టాఫీస్ ద్వారా తమిళనాడులోని చెన్నై ఎయిర్పోర్ట్కు ఒక పార్సిల్ చేరింది. ఇందులో ఆంథ్రోపోడ్ జాతులు ఉన్నాయన్న అనుమానంతో చెన్నై ఎయిర్ కస్టమ్స్ సిబ్బంది దానిని తనిఖీ చేశారు. పార్సిల్ను తెరిచి చూడగా లోపల థర్మోకోల్ బాక్స్ ఉన్నది. అందులో 10 చిన్న ప్లాస్టిక్ వైల్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో బతికి ఉన్న సాలీడు పురుగులను కస్టమ్స్ సిబ్బంది కనుగొన్నారు. వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్సిల్పై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.