కంగ్టి, ఏప్రిల్ 5 : కంగ్టి ప్రాంతంలో ప్రసిద్ధి గాంచిన సిద్దేశ్వరాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సిద్దేశ్వరాలయ ఆవరణలో ఆలయ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి అనేక నిధులు కేటాయిస్తున్నదని పేర్కొన్నారు. కంగ్టి నుంచి ఆలయం వరకు బీటీరోడ్డు ఏర్పాటు కోసం గతంలోనే ప్రభుత్వం రూ.40 లక్షలు మంజూరు చేసిందన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని వెల్లడించారు.
సిద్దేశ్వరాలయానికి కర్నాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరిలివస్తారని, వారికోసం అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఆలయ ఆవరణలో కల్యాణ మండపం నిర్మించేందుకు కూడా ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత అధికారులు ఇందిరా, శివరుద్రప్పలకు సూచించారు. అంతకుముందు ఆలయ చైర్మన్గా జయప్రకాశ్తొత్లా, పాలకవర్గ సభ్యులుగా బస్వరాజ్, తొంట మారుతి, గోపాల్రెడ్డి, సావిత్రి, జైకిషన్ ఆలయాధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఆంజనేయులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంతోశ్పాటిల్, టీఆర్ఎస్ నాయకులు వెంకట్రెడ్డి, సిద్దుపాటిల్, కృష్ణముదిరాజ్, రాజుపాటిల్, చంద్రశేఖర్, బాబుసేట్, అంబాజీరావు తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం
ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పరం సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్లో పంచాయతీ కార్యదర్శుల డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించి మాట్లాడారు. కొంత మంది విపక్ష పార్టీల నాయకులు అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తనకు తెలుసని, అధికారులంతా కలిసికట్టుగా ఉండి దౌర్జన్యాలను ఎదురించాలన్నారు. క్రీడా స్ఫూర్తితో పోటీపడాలన్నారు. కార్యక్రమంలో నారాయణఖేడ్, సిర్గాపూర్ ఎంపీపీలు చాందిబాయి చౌహాన్, మహిపాల్రెడ్డి, సిర్గాపూర్, పెద్దశంకరంపేట జడ్పీటీసీలు రాఘవరెడ్డి, విజయరామరాజు, ఆత్మ చైర్మన్ రాంసింగ్, ఎంపీడీవో వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
లాక్డౌన్పై నకిలీ జీవో సృష్టికర్త అరెస్ట్