డెహ్రాడూన్: ప్రతిష్ఠాత్మక చార్ధామ్ యాత్ర ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి చెప్పారు. కరోనా నిబంధనలను పాటిస్తూ యాత్ర నిర్వహించడానికి నైనితాల్ హైకోర్టు అనుమతించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో యాత్ర సజావుగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.