న్యూఢిల్లీ : ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చాకలి ఐలమ్మ చిత్రపటానికి జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్తో పాటు పలువురు ఉద్యోగులు పూలమాల వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.