బొంరాస్పేట మార్చి30: మెట్లకుంట గ్రామం ప్రగతి పథంలో దూసు కెళ్తున్నది. ఒకప్పుడు అధ్వాన్నంగా ఉన్న అంతర్గత రహదారులు, రోడ్లపై పారే మురికి నీరు, పెద్ద పెద్ద మురికి గుంతలతో కనిపించే గ్రామం పల్లె ప్రగతితో కొత్తదనాన్ని సంతరించుకుంది. ప్రతి రోజూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలతో గ్రామం పరిశుభ్రంగా కనిపిస్తున్నది. గ్రామ పంచాయతీకి మంజూరైన ట్రాక్టర్తో ఇళ్ల నుంచి చెత్తను సేకరిస్తున్నారు. పచ్చదనం పెంచ డానికి నర్సరీని ఏర్పాటు చేసి 11 వేల మొక్కలు పెంచుతున్నారు. 30 రోజుల ప్రణాళికలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.65 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టగా చాలా వరకు పూర్తయ్యాయి.
ఆహ్లాదంగా ప్రకృతి వనం
గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రూ.4 లక్షల వ్యయంతో పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించి పలు రకాల మొక్కలు నాటారు. వాటికి రక్షణగా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మొక్కలు ఎండిపోకుండా ప్రతి రోజూ నీళ్లు పోస్తున్నారు. గ్రామంలోనే ప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో ప్రజలకు, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందని గ్రామస్తులు భావిస్తున్నారు.
రూ. 22 లక్షలతో రైతు వేదిక
గ్రామంలో రూ.22 లక్షలతో విశాలమైన స్థలంలో రైతు వేదికను నిర్మించారు. వ్యవసాయాధికారులు ఎప్పుడు సమావేశాలు నిర్వహించినా గ్రామ పం చాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించేవారు. ఇప్పుడు రైతు వేదిక అందుబాటులోకి రావడంతో సమావేశాలు దీంట్లోనే నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా రూ.2.10 లక్షలతో కంపోస్టు షెడ్, రూ.50 వేలతో డంపింగ్ యార్డు నిర్మించారు. రూ.12.60 లక్షలతో వైకుంఠధామం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి రూ.9.37 లక్షల తో ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. ఇంటి నుంచి చెత్తను సేకరించి ట్రాక్టర్లో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రతినిత్యం రోడ్ల ను, మురుగు కాల్వలను శుభ్రం చేస్తుండడంతో గ్రామం పరిశుభ్రంగా మా రింది. దోమల బెడద తగ్గి ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారు.
మురికి గుంతలు, బావుల పూడ్చివేత
30 రోజులు, 10 రోజుల ప్రణాళికలో రూ.11 లక్షలతో పనులు చేపట్టారు. ఇండ్ల పక్కన ఉన్న మురికి గుంతలు, పాడుబడ్డ బావి, పురాతన ఇండ్లను పూడ్చివేశారు. ఖాళీ స్థలాల్లో పెరిగిన ముళ్ల కంపను తొలగించి శుభ్రం చేశారు. రూ.1.50 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో ఆంజనేయస్వామి దేవాలయం ముందు నుంచి సీసీ రోడ్డు నిర్మించారు. 4వ వార్డులో ఉపాధి నిధులతో సీసీ రోడ్డు నిర్మించగా గ్రామ పంచాయతీ నిధులు రూ.2 లక్షలతో రోడ్డు పక్కన అండర్గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించారు. దీంతో వీధి శుభ్రంగా మారింది. పవర్ వీక్లో భాగంగా గ్రామంలో శిథిలావస్థకు చేరిన స్తంభాలను తొలగించారు. విద్యుత్ స్తంభాలు లేక వైర్లు కిందకు వేలాడుతుండగా 17 కొత్త స్తంభాలను పాతి వాటిని సరిచేశారు. గ్రామంలో పచ్చదనం పెంచడానికి 11 వేల మొక్కలతో నర్సరీని ఏర్పాటు చేశారు.
గామ రూపురేఖలు మార్చేశాం
పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామ రూపు రేఖలను మార్చివేశాం. ప్రతినెలా మం జూర వుతున్న నిధులతో పాటు ఉపాధి నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం. గ్రామం లో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యమిస్తూ ప్రతిరోజూ కార్మికులతో రోడ్లను శుభ్రం చేయిస్తున్నాం. చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం. గ్రామంలో నాటిన మొక్కలను సంరక్షిస్తున్నాం.
-కావలి నారాయణ, సర్పంచ్
ఇవీ కూడా చదవండి..
మూసీనదిని సుందరంగా తీర్చి దిద్దుతాం
ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి