న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 10 రాష్ట్రాల్లో 46 జిల్లాల్లో 10 శాతానికి పైగా పాజిటివిటీ రేటు ఉన్నది. ఈ నేపథ్యంలో సంబంధిత జిల్లాల్లో ఆంక్షలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. స్ట్రిక్ట్ కంటైన్మెంట్ చర్యలపై ద్రుష్టిని కేంద్రీకరించాలని సూచించింది. 60 ప్లస్, 45-60 ఏండ్ల మధ్య వయస్సు గల వారికి వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని పేర్కొంది.
కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం తాజాగా సమీక్ష జరుపడం గమనార్హం. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అసోం, మిజోరం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో నూతన కేసులు పెరుగుతున్నాయి.
46 జిల్లాల్లో 10 శాతానికి పైగా పాజిటివిటీ రేటు నమోదవుతున్నది. 53 జిల్లాల్లో కరోనా కేసుల పాజిటివిటీ రేటు 5-10 శాతం మధ్య ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పరీక్షలు పెంచాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాల్లో ఎటువంటి అలసత్వాన్ని ప్రదర్శించినా పరిస్థితి మరింత దిగజారుతుందని కేంద్రం హెచ్చరించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
ICICI Bank alert | ఆగస్టు నుంచి ఖాతాదారుల లావాదేవీలపై చార్జీల మోత..!