వాట్సాప్ ప్రైవసీ పాలసీ : కేంద్రం ఫైర్

న్యూఢిల్లీ : వాట్సాప్ నూతన ప్రైవసీ విధానాన్ని ఎంచుకునే విషయంలో యూరోపియన్ యూజర్లతో పోలిస్తే భారత యూజర్ల పట్ల మెసేజింగ్ యాప్ భిన్నంగా వ్యవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఢిల్లీ హైకోర్టుకు వివరించింది. భారత యూజర్లపై వాట్సాప్ తన ప్రైవసీ పాలసీలో మార్పును ఏకపక్షంగా రుద్దడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. ఫేస్బుక్ నేతృత్వంలోని వాట్సాప్ నూతన ప్రైవసీ విధానానికి వ్యతిరేకంగా ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ న్యాయమూర్తి సంజీవ్ సచ్దేవ్ ఎదుట ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు.
తమ డేటాను ఫేస్బుక్, వాట్సాప్ల్లో షేర్ చేయకుండా ఉండే అవకాశాన్ని భారత యూజర్లకు ఇవ్వకపోవడాన్ని శర్మ ఆక్షేపించారు. ఇది యూజర్ల సమాచార గోప్యత, సమాచార భద్రతకు భంగకరమని కోర్టుకు నివేదించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే నిర్థిష్ట సమాచారం అందచేయాలని వాట్సాప్ను కోరిందని తెలిపారు. ప్రభుత్వం కోరిన వివరాలపై త్వరలోనే స్పందిస్తామని వాట్సాప్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్పై విచారణను హైకోర్టు మార్చి 1కి వాయిదా వేసింది.
తాజావార్తలు
- ఇంగ్లాండ్ 81 ఆలౌట్.. భారత్ టార్గెట్ 49
- కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
- ఎంటర్ టైనింగ్గా 'షాదీ ముబారక్' ట్రైలర్
- ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతూ పడిపోబోయిన సీఎం మమత
- ఘట్కేసర్ ప్లైఒవర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
- 82 వేల హ్యుండాయ్ కోనా ఈవీల రీకాల్.. అందుకేనా?!
- దారుణం : కురుక్షేత్ర హోటల్లో బాలికపై సామూహిక లైంగిక దాడి
- ఉద్యోగాల కల్పనపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
- అక్షర్ ట్రిపుల్ స్ట్రైక్..ఇంగ్లాండ్ 56/5
- మహిళ ఉసురు తీసిన అద్వాన రోడ్డు.. బస్సు కిందపడి మృతి