ములుగు : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి. 2022, ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం సమ్మక్క – సారలమ్మను జాతరను నిర్వహించనున్నారు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో గల ఆదివాసీ గిరిజన దైవాలు శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మల మహా జాతరను ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. వచ్చే సంవత్సరం నిర్వహించే జాతర తేదీలను పూజారులు నిర్ధారించారు. 2022, ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్నట్లు ఆదివారం మేడారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పూజారులు తెలిపారు.
ఇవికూడా చదవండి..