న్యూఢిల్లీ, మే 28: పౌరుల సాధారణ సమాచార(నాన్ పర్సనల్ డాటా) సేకరణ, నిల్వ, అవసరమైన వారికి ఆ సమాచారం ఇవ్వడానికి సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ శనివారం ‘నేషనల్ డాటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్’ ముసాయిదాను విడుదల చేసింది. దీనిపై అభిప్రాయాలను తెలపాలని సంబంధిత వర్గాలను కోరింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు పౌరుల సాధారణ సమాచారం ఇవ్వడం ద్వారా వారి సేవల్లో నాణ్యతను పెంచేందుకు కేంద్రం ఈ ఫ్రేమ్వర్క్ను రూపొందించింది. పరిశోధనల కోసం ఈ సమాచారాన్ని వాడుకోవచ్చని తెలిపింది. కృత్రిమ మేధ ఆధారంగా వచ్చిన స్టార్టప్లను దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్రేమ్వర్క్ను రూపొందించినట్టు కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఇది డిజిటల్ గవర్నమెంట్కు ప్రోత్సాహాన్నిస్తుందన్నారు.