లొంగిపోతే కేసుల ఎత్తివేత
కుటుంబానికే రివార్డు
ఏసీపీ సారంగపాణి
శేషయ్య కుటుంబానికి పరామర్శ
ఎలిగేడు, జూలై 6: అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు దీకొండ శంకరయ్య, అలియాస్ శేషయ్య వనాన్ని వీడి జనంలోకి రావాలని, కుటుంబు సభ్యులతో ప్రజలతో కలిసి శేష జీవితాన్ని క్షేమంగా గడపాలని పెద్దపల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ ) సారంగపాణి కోరారు. ఎలిగేడులోని శ్రీశ్రీనగర్(బీసీ) కాలనీలో నివాసముంటున్న శంకరయ్య భార్య శకుంతల, కుమారులు తిరుపతి, రవిని మంగళవారం సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ షేక్జానీపాషాతో కలిసి వెళ్లి ఏసీపీ పరామర్శించారు. శకుంతలకు పండు,్ల నూతన వస్ర్తాలు అందించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ అడవిలో ఉంటున్న శంకరయ్య(శేషయ్య) జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. ప్రజలను అతలాకుతలం చేస్తున్న కరోనా నేపథ్యంలో అడవిలో ఉండి ప్రయోజనం లేదని, ప్రజల్లోకి వస్తే ప్రభుత్వపరంగా ఆయన మీద ఉన్న కేసులు ఎత్తివేసి రివార్డును కూడా నేరుగా కుటుంబానికి అందిస్తామని హామీ ఇచ్చారు. ఏ విధంగా ప్రభుత్వానికి లొంగిపోయినా పోలీసుశాఖ స్వాగతం పలుకుతుందని చెప్పారు. శంకరయ్య కుటుంబానికి అదనంగా వ్యవసాయభూమి, ఇద్దరు కొడుకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శంకరయ్యను లొంగిపోవాలని భార్య శకుంతల, కొడుకులు తిరుపతి, రవి మీడియా ద్వారా కోరారు. ఇక్కడ సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, జూలపల్లి ఎస్సై షేక్జానీపాషా, పోలీసు సిబ్బంది, ఎలిగేడు ఎంపీపీ తానిపర్తి స్రవంతి, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ పద్మావతి, శ్రీనివాస్, ఎంపీవో అనిల్రెడ్డి, పీఆర్ ఏఈ జగదీశ్వర్, సర్పంచ్ బూర్ల సింధూజ, ఉప సర్పంచ్ కోరుకంటి వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, ఈజీఎస్ ఏపీవో సదానందం, ఆనంద్, గ్రామ పద్మశాలీ సంఘ గౌరవాధ్యక్షుడు బూర్ల సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మోహన్రావు, మాజీ సర్పంచ్ రాజనర్సయ్య, కార్యకర్తలు ఉన్నారు.
మొక్కలు నాటిన ఏసీపీ…
ఏసీపీ సారంగపాణి ఎలిగేడు గ్రామ శ్రీశ్రీనగర్(బీసీ)కాలనీలోని పద్మశాలీ సామాజిక భవనం ఆవరణలో మొక్కలు నాటారు. సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై షేక్జానీపాషా వాటికి ట్రీ గార్డులు పెట్టి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఏసీపీ, సీఐ, ఎస్సైని ఎంపీపీ స్రవంతి, సర్పంచ్, ఉపసర్పంచ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ బూర్ల సింధూజ, కోరుకంటి వెంకటేశ్వరరావు, రాంరెడ్డి, తానిపర్తి మోహన్రావు, మండిగ రాజనర్సయ్య శాలువాలు కప్పి సన్మానించారు.