ఢిల్లీ : కేంద్ర పోలీసు, సాయుధ బలగాల ఎంపికల్లో వికలాంగులకు మినహాయింపులు ఎత్తివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగాలలో వికలాంగులకు (పీడబ్ల్యూడీ) తప్పనిసరి 4% రిజర్వేషన్ నుండి భారతీయ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) కింద ఉన్న పోస్టులకు కేంద్రం మినహాయింపునిచ్చింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ సహా.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఢిల్లీ, అండమాన్, లక్షద్వీప్, దామన్, దాద్రానగర్ నగర్ హావేలి పోలీసు, కేంద్ర సాయుధ బలగాలు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, అసోం రైఫిల్స్లోని అన్ని రకాల ఉద్యోగాలకు వికలాంగులకు ఉన్న పలు మినహాయింపులను కేంద్రం రద్దు చేసింది. కేంద్ర వికలాంగుల శాఖ ఛీఫ్ కమిషనర్తో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ కేంద్ర సామాజిక న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.