అమెజాన్, ఫ్లిప్కార్ట్పై చర్యలకు కేంద్రం ఆదేశం

ఢిల్లీ : ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లపై చర్యలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అమెజాన్, వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ కంపెనీలు ఎఫ్డీఐ పాలసీ, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, 1999 (ఫెమా) ను ఉల్లంఘించాయని ఆరోపిస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) చేసిన పలు ఫిర్యాదులను అనుసరించి కేంద్రం ఈ ఆదేశాలు జారీచేసింది.
వివిధ కంపెనీలకు ఇ-కామర్స్ సంస్థలకు మధ్య జరిగిన ఒప్పందంలో బ్రాండ్ రిటైలింగ్ పేరుతో ఏ విధంగా ఎఫ్డీఐ పాలసీ, ఫెమా చట్టాలను ఉల్లంఘించాయో తెలియజేస్తూ సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీ.సీ. భారతీయ, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఈడీ, ఆర్బీఐకి ఇచ్చిన సమాచారంలో పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఆస్కార్ రేస్లో విద్యాబాలన్ సినిమా నట్ఖట్
- శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఆల్ట్రా 5G బుకింగ్స్ ప్రారంభం
- సింగపూర్లో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- తెలంగాణ-గుజరాత్ల మధ్య అవగాహన ఒప్పందం
- పట్టని నిబంధనలు.. టీకాలు వేయించుకున్న ఎమ్మెల్యేలు
- ఐస్క్రీంకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందోచ్!
- యూట్యూబ్లో ఆకట్టుకుంటున్న ‘అలా సింగపురం’లో..
- అల్లు అర్జున్ బాటలో శిరీష్
- జంపన్న వాగులో ఈతకెళ్లి ఇద్దరు పిల్లలు మృతి
- వ్యాక్సిన్ రావడం శుభసూచకం : మంత్రి సత్యవతి రాథోడ్