పిట్లం, జూన్ 10 : జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. జొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని హర్షిస్తూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గురువారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయంతో జుక్కల్ ప్రాంతంలో జొన్న సాగు చేసిన రైతులకు మేలు జరుగుతుందన్నారు.
పిట్లం మండలంలో 5250 ఎకరాల్లో రైతులు జొన్న సాగు చేయగా, నియోజకవర్గం మొత్తం 18 వేల ఎకరాల్లో సాగు చేశారని అన్నారు. సీఎం కేసీఆర్కు రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి, విండో చైర్మన్లు నారాయణరెడ్డి, శపథంరెడ్డి, వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు విజయ్, జొన్న శ్రీనివాస్రెడ్డి, నర్సాగౌడ్, బుడాల నవీన్, నారాయణరెడ్డి, శశి, లక్ష్మారెడ్డి, రహమతుల్లా, శ్రీనివాస్రెడ్డి, శ్రీకర్రెడ్డి, షఫీ తదితరులు పాల్గొన్నారు.