ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. కోస్తా ప్రాంతంలోని రత్నగిరి జిల్లాలో ఆయన్ను అరెస్టు చేశారు. జన ఆశీర్వాద్ యాత్రలో పాల్గొంటున్న రాణేను భోజనం చేస్తుండగానే కస్టడీలోకి తీసుకున్నారు. సంగమేశ్వర్ పోలీసు స్టేషన్లో రాణే మద్దతుదారులకు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. రాణేపై పలు కేసులు నమోదు చేశారు. థానేలోని నౌపాద్ పోలీసు స్టేషన్లో 500, 505(2), 153-బీ(1)(సీ) సెక్షన్ల కింద కేసులను బుక్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం వెళ్లిన రాణేకు బాంబే కోర్టులో ఊరట లభించలేదు.